చీకటిని రాశిగా పోసి
చిటికెడు వెన్నెల కలిపితే..
అమాయకత్వం అందమై
కళ్లముందు నిలుస్తుంది
కదిలే ఈ నల్లనిశిలపై
కళ్లు నిలిపిచూశావో..
నవాజుద్దీన్ మాంఝీ కొండనెందుకు చీల్చాడు
మహాభారత యుద్ధమెందుకు జరిగింది
ప్రశ్నలన్నీ పేలిపోతాయి
ఆత్మబంధువులో రాధ..
ఫగునియాదేవిలా రాధికా..
భారతంలో ద్రౌపది..
నలుపుపై మనసుపడితే
యుద్ధమో వీరకార్యమో
వజ్రం ఊరికే దొరకదు మరి.....
(పాత ఫేస్బుక్ పోస్ట్)
No comments:
Post a Comment