Saturday, January 21, 2017

ఏది హింస.. ఏది అహింస..?


చాగంటికీ.. జల్లికట్టుకీ ముడిపెట్టి రాస్తున్నానిది.
బెలూచిస్తాన్ కీ.. లంక తమిళులకీ ముడిపెట్టి రాస్తున్నా ఇది..
కర్నాటక కావేరీ నీళ్లకీ... మెరీనాబీచ్ సాగరఘోషకీ లింక్ కలిపి రాస్తున్నా ఇది..
ఇంతకీ ఏది హింస.. ఏది అహింస..?

తన కులం మాత్రమే పరమపవిత్రమైందనుకునే చాగంటి ప్రవచనాల పేరుతో జనం గొంతులు కోస్తాడు. ఆయన మాంసాహారం ముట్టని బ్రాహ్మణుడు.. కానీ శ్రమజీవుల రక్తాన్ని ప్రవచనాలతోనే పీల్చేస్తాడు. తలకడిగితే మొలకడగరు.. మొలకడిగితే తలకడగరు అంటూ యాదవుల్ని నీచంగా అవమానిస్తాడు. ఇదేంటని అడిగితే ఆ మహానుభావుడ్నే ప్రశ్నిస్తారా అంటూ ఓ బ్యాచ్ దాడి మొదలుపెడుతుంది. అంతా మాటలతోనే. ఎక్కడా రక్తపు చుక్క చిందదు. ఇదీ ఈ దేశంలో అహింసకి అర్ధం.

బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ హింసకు పాల్పడుతుంది, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి.. మీడియా కోడై కూస్తున్న వార్తలివి. లంక తమిళులపై ఘోరాలు జరిగినప్పుడు మాత్రం అది ఎల్టీటీయీకి లంక సైన్యానికి జరుగుతున్న యుద్ధం మాత్రమే అవుతుంది. కాశ్మీరీ పండిట్లని తరిమేసిన దారుణాలపై ఇప్పటికీ చర్చలు జరుగుతుంటాయి. కానీ తమిళ జనానికి మాత్రం బాసటగా నిలబడలేం. దేశవ్యాప్తంగా దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలపై సాగే దాడులకి సమాధానాలు ఉండవు. యాకూబ్ మెమెన్ కి ఉరిశిక్షని వ్యతిరేకిస్తే తంతామంటారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీ అనారోగ్యం గురించి చింతిస్తారు. ఇదీ ఈ దేశంలో అహింసకి అర్ధం. 

ఏది హింస ఏది అహింస.. ఎవరు టెర్రరిస్టులు ఎవరు శాంతికాముకులు.. అనే అంశాల్ని ఈ దేశపు యువతకు అర్ధంకాని బ్రహ్మపదార్ధాలుగా మార్చేశారు. కానీ ఒకటి నిజం అణిచివేత ఎదుర్కొనేవాడే గట్టిగా అరుస్తాడు. అవసరమైతే తెగిస్తాడు. జల్లికట్టుకి మద్దతు పలకడమో.. నిషేధానికి మద్దతు పలకాలన్నదో నా ఉద్దేశం కాదు. నాకు ఏ మాత్రం పరిచయం లేని విషయం అది. టీవీల్లో చూడడం తప్ప జల్లికట్టు గురించి నాకు తెలిసింది శూన్యం. కానీ మెరీనా బీచ్ లో సాగిన ఉద్యమం వెనుక తెగింపు ఉంది. వేల ఏళ్లుగా కొనసాగిన అణచివేతని ఎదిరించే తెగింపు అది. ఈ దేశప్రభుత్వాన్ని, చట్టాల్ని ఖాతరు చేయని తెగింపు అది. 

వేల ఏళ్లదాకా ఎందుకు ఇటీవలి పరిణామాల వరకే చూద్దాం. కావేరీ నీళ్లని తమిళనాడుకి వదలాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ కర్నాటక విన్నది లేదు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నదీ లేదు. తమిళనాడు కంటే బీజేపీకి కర్నాటక ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అప్పుడు అమలు కాని సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడెందుకు గౌరవించాలి తమిళ ప్రజలు. అందుకే కావేరి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయడం లేదని కర్నాటక ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని కేంద్రం.. జల్లికట్టు లాంటి చిన్నవిషయంలో కూడా నోరు మెదపలేకపోయింది. ఇక్కడ గెలిచింది తమిళుల తెగింపు కాదు.. కేంద్రప్రభుత్వం, చట్టాలు ఓడిపోయాయంటేనే కరెక్ట్ గా ఉంటుంది. మెరీనా బీచ్ లో నిలబడి ఉన్న యువతలో.. జల్లికట్టుని గెలుచుకున్న ఉత్సాహం మాత్రమే కాదు, మా బతుకుల్ని శాసించే హక్కు మీకు లేదన్న ధిక్కారం కూడా కనిపిస్తోంది.

7 comments:

  1. అంతర్ముఖుడి ఆవేదన అద్భుతం

    ReplyDelete
  2. హింస‌..అహింస మ‌ధ్య‌ ఒక్క అ మాత్ర‌మే వుంది. ఆ అ కొంద‌రికి అవ‌స‌రం..కొంద‌రికి అవ‌కాశం. అందుకే చెప్ప‌లేం ఏది ఏది హింసో! ఏది అహింసో?

    ReplyDelete
  3. నీ మద్దతు 'ప్రస్తుత హింసావాదాని'కా

    ReplyDelete
    Replies
    1. తమిళ స్ఫూర్తికి కచ్చితంగా మద్దతిస్తాను. బట్ హింస ఏ రూపంలో అయినా హింసే..

      Delete